Skip to main content

Posts

Showing posts from September, 2020

covidology- part 3

భూమౌ స్ఖలితపాదానాం భూమిరే వావ లంబనమ్‌  త్వయి జాతాపరాధానాం త్వమే వాలంబనం గురోః.  నేలను ఛిద్రం చేసినా పచ్చటి పంటను ప్రసాదించినట్లే,గురువును ఏమన్నా క్షమించి మంచి దారిలో పెట్టడానికే శ్రమిస్తాడు.  నేలను తన్నినా నేలకేమీ కాదు. మన కాలే దెబ్బతింటుంది. అలాగే గురువును ఏమన్నా గురువుకేమీ కాదు. నష్టపోయేది శిష్యుడే.  అలాగే వైద్యుల పై దాడి చేస్తే నష్టపోయేది రోగులే !   భారతదేశ ఆరోగ్యరంగం లో ఎన్ని బలహీనతలున్నాయో వాటన్నింటినీ బహిర్గతం చేసిందీ వైరస్. ఒక విధంగా పాలకుల ప్రయారిటీలను సమూలంగా మార్చి ఆరోగ్యరంగ సామర్ధ్యాన్ని పెంచ వలసిన అవసరాన్ని కఠినంగా గుర్తు చేసింది.  సెప్టెంబర్ మాసాంతానికి 60 లక్షల పాజిటివ్ కేసులను కనుగొన్నారు. కానీ సీరో సర్వే సమాచారాన్ని విశ్లేషిస్తే కనుగొన్న (recorded cases) కేసులకు 60 రెట్లు జనాభాకు వైరస్ సోకిఉంటుందని శాస్త్రవేత్తల అంచనా . లక్ష  కోవిద్ మరణాలు లెక్క తేలాయి. కానీ రాష్ట్రాల రిపోర్టింగ్ లోప భూయిష్ టంగా ఉందని కొందరు చెప్పిన విషయాన్ని పరిగణన లోకి తీసుకొంటే ప్రకటించిన దాని కంటే రెట్టింపు అనగా సెప్టెంబర్ నెలా ఖరుకి 2లక్షల కోవిద్ మరణాలు సంభవించాయని అనుకోవచ్చు.  ఎంతమ

*IMA demands bulldozed ruthlessly by the central Govt.*

*IMA demands bulldozed ruthlessly by the central Govt.*  ఎన్‌ఎంసీ కింద 4 స్వతంత్ర మండళ్లు  ఏర్పాటు చేసిన కేంద్రం వైద్య విద్యా రంగంలో సరికొత్త ప్రయాణం మొదలు ...  వైద్య విద్య పర్యవేక్షణ కోసం ఎంసీఐ స్థానంలో శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) కింద కేంద్ర ప్రభుత్వం నాలుగు స్వతంత్ర మండళ్లను ఏర్పాటు చేసింది. ఆ చట్టంలోని నిబంధనల ప్రకారం వీటికి శ్రీకారం చుట్టింది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు(యూజీఎంఈబీ) ప్రెసిడెంట్‌గా అహ్మదాబాద్‌కు చెందిన జీఆర్‌ దోషి, కేఎం మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కిడ్నీ డిసీజ్‌ రీసెర్చి సెంటర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అరుణ వి.వాణికర్‌ నియమితులయ్యారు. పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు(పీజీఎంఈబీ) ప్రెసిడెంట్‌గా బెంగుళూరు మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ ఎంకేరమేష్‌, మెడికల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డు (ఎంఏఆర్‌బీ) ప్రెసిడెంట్‌గా దిల్లీలోని డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ మెడికల్‌ కాలేజ్‌ డైరెక్టర్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ అచల్‌ గులాటి నియమించార

Indian digital health Mission Impossible

  E very Indian will get a new Aadhar-like health ID that will store the individual's medical records, including doctor visits, diseases, the line of treatment and drugs taken. The scheme will map every citizen's health with a unique ID. This will also come integrated with the facility of using telemedicine, e-pharmacy, creating a national health registry.  WHAT is Digital ID  The health ID will be in the form of a mobile application. who creates digital Id?  Patients can create a health ID.  The new Health ID will be available in the form of a mobile application, where a user will log in and put all his/her relevant details to it. Doctors and pharmacies will update it with each physical or virtual visit. what is the benefit of the ID? It would  allow the CITIZENS to share their data between hospitals and doctors digitally.  This digital format of the person’s health record will be linked to the registry of doctors and health facilities across the country, so any doctor can re

covidology- part 1- SURREALISTIC DOCTORS & Absurd Govt.

ఇది కష్టకాలం. కోవిద్ మహమ్మారినిఎదుర్కొవాలంటే  ప్రభుత్వమేకాదు ప్రవేట్ హాస్పిటల్స్ కూడా కొన్ని త్యాగాలకు సిద్ధం కావలసిన సమయం .  భిన్న రాష్ట్రాలలో వైద్య సౌకర్యాలు,వైద్య బృందాల అందుబాటు   భిన్నంగా ఉంటాయి.  భిన్న పార్శ్వాలున్నభారతదేశం లోని అన్ని రాష్ట్రాలకూ ఒకే రకమైన విధి విధానాలను ఖరాఖండీగా సూచించలేము.  ట్రీట్ మెంట్ చార్జీలైనా , టెస్టింగ్   విధానాలైనా  భిన్నంగా ఉంటాయి.  అలాగని వదిలేయలేం. ప్రభుత్వమే బాధ్యతతీసుకొని   విధి విధానాలను సూచించాలి. - ఇదీ సుప్రీం కోర్ట్ చెప్పిన మాట.  ఏ హాస్పిటల్స్ ఐతే ప్రభుత్వాలనుండి సహాయాన్ని పొందాయో కనీసం ఆ హాస్పిటల్స్  సబ్సి డైజెడ్ ట్రీట్ మెంట్ అందివ్వాలని ఒక పిటిషనర్ కోరిన మీదట కోర్ట్  పై విధంగా వాఖ్యానించింది. కరోనా: ‘అధిక ఫీజులపై సమాధానం ఇవ్వండి’ Jun 05, 2020, 12:59 IST కరోనా రోగుల చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేయాల్సిన ఫీజుకు పరిమితి విధింపుపై సుప్రీంకోర్టు లో శుక్రవారం విచారణ జరిగింది. ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, అందువల్ల చాలా మంది బాధితులకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేక, వాటి సేవ

Covidology -part 2

ఆంద్ర రాష్ట్రం కోవిద్ యుద్ధం కోసం మౌలిక సదుపాయాలను బాగానే ఏర్పాటు చేసింది. టెస్టింగ్ కిట్స్ కొనుగోలు , పరీక్షల నిర్వహణలో దేశంలోనే టాప్ 3 లో ఉంది. కానీ , రక్షణ దుస్తుల కొనుగోలు,వాటి నాణ్యతా ప్రమాణాలు అంతగా బాగోలేవు.  ప్రవేట్ హాస్పిటల్స్ లో వసూల్ చేసే ఫీజులపై నియంత్రణ పెట్టడం చేత ప్రవేట్ హాస్పిటల్స్ కోవిద్ వైద్యాన్ని సంపూర్ణం గా అందించలేక పోతున్నాయి. ప్రవేట్ హాస్పిటల్స్ దోపిడీ చేస్తున్నాయని మీడియా ,కొంతమంది ప్రజలు అనవసరమైన అపోహలు వ్యాప్తి చేస్తున్నారు. ప్రభుత్వం వేలాది బెడ్స్ ఏర్పాటు చేస్తే, వాటిని వినియోగించుకో కుండా ,  స్థోమత ఉన్నవాళ్ళకోసం  ఏర్పాటు చేసిన   కార్పొరేట్ ప్రవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళమని ఎవరు చెప్పారు?  ప్రభుత్వ రంగం లో 40000 బెడ్స్ ఉంటే ప్రవేట్ రంగం లో కేవలం 5000 కోవిద్ బెడ్స్ మాత్రమే ఉన్నాయి. వాటిని మధ్య, ఎగువ తరగతి వారు వినియోగించుకొంటారు. ప్రభుత్వ మరియు  ప్రవేట్ భీమా సదుపాయం ,ధన వంతులకోసం  ఏర్పాటు చేసిన ప్రవేట్ హాస్పిటల్స్ కి లక్షలు చెల్లించే సత్తా ఉన్నవారే వెళ్ళాలి. దిగువ మధ్యతరగతి వాళ్ళు అక్కడకు వెళ్ళకూడదు. రోజుకి అరలక్ష చొప్పున 10 రోజులకు కనీసం 5 లక్షలు చెల్లించే