Skip to main content

2019 లో గెలుపెవరిది ?

2019-ఏప్రిల్ నెల -11 వ తారీఖు -చైత్ర మాసం-వసంత ఋతువు- శుక్లపక్షం-గురువారం -షష్టి -ఆరుద్ర నక్షత్రం- శోభనయోగం . ఈ సమయం లో ఆంధ్ర రాష్ట్రంలో 175 శాసనసభసీట్లకు, 25 పార్లమెంట్ సీట్లకు సార్వత్రిక ఎన్నికలు. 

గత 5 ఏళ్లలో అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని జోడు గుర్రాల లెక్క పరుగులు పెట్టించి, రాష్ట్ర రెవెన్యూ ఆదాయాన్ని 35000 కోట్లనుండి 75000 కోట్లకు అనగా రెట్టింపు చేసి, అన్నిరంగాలలో దేశ వ్యాప్తంగా నంబర్ 1 రాష్ట్రం గా తీర్చిదిద్దిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు  ను ఏదో కుట్రపన్ని,కుతంత్రాలు చేసి, ఆంధ్రుల ఓట్లను గల్లంతు చేసి,  TDP  పార్టీ సేవామిత్రల డేటా ని దొంగిలించి,  TDP పార్టీ అభ్యర్థుల వ్యాపారాలకు  ఆస్తుల కు ఇబ్బంది పెడతామని బెదిరించి నానా క్రిమినల్ చర్యలను చేస్తున్న YSR పార్టీ కి TRS నాయకుడు  KCR  తోడు కలిసి, కుళ్ళు రాజకీయ క్రీడలుసలపడమేకాక, దొంగచాటుగా కోర్టులో పోలవరాన్ని ఆపే కుతంత్రం కూడా చేస్తున్న  సంక్లిష్ట పరిస్థితుల్లో ,తెలివైన ఆంధ్రులు ఎలాటి తీర్పు ఇవ్వబోతున్నారు ? అనే ప్రశ్నకు సమాధానంగా ... 
నేను ఎనలైజ్ చేసిన డేటా , పేరుపొందిన ఒక సంస్థ ఇచ్చిన పిక్టో గ్రాఫ్ తో సరిపోలిక గా ఉంది. 


ఆంధ్రాలో ఉన్న 4 కోట్ల ఓటర్లలో 75% పోలింగ్ జరిగితే అనగా 3కోట్ల ఓట్లు పోల్ అవుతాయి. 70% పోల్ ఐతే 2. 80 కోట్ల ఓట్లు పోల్ అవుతాయి. 

ఈ ఎన్నికలలో ముస్లిం ఓట్లు చాల కీలకం. ఆంధ్రాలో వీరి శాతం 10%. అంతేకాదు  ఈ వర్గంలో 90% పోలింగ్ చేస్తారు. అలాగే మాలల ఓట్లు 8% , మాదిగల ఓట్లు 7% మరియు గిరిజన ఓట్ల శాతం 7%. వీరు కూడా గంప గుత్తగా ఓటు వేస్తారు.అంతేకాక, ఈ వర్గాలవారు 90% పోలింగ్ చేస్తారు. 
ఈ వర్గాల నుండి ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువ. 
సంక్షేమ పధకాల వలన ఎక్కువ శాతం లబ్ది పొందిన వారిలో ఈ వర్గాలవారు ఎక్కువ ఉన్నారు కాబట్టి , ముస్లిమ్స్ నుండి 7%, మాలల  నుండి 3%,మాదిగలు 4%,గిరిజనం 4%  వెరసి మొత్తం 32 % లో  18% ఓట్లు తెలుగుదేశానికి పడే అవకాశం ఎక్కువ. అంటే 32 %లో సగానికంటే ఎక్కువ అనగా 18% వస్తాయి. 
అనగా ఒక్క కోటి  32 లక్షల ఓట్లలో 1. 19 కోట్ల  ఓట్లు పోల్ అయితే , టి డి పికి  68  లక్ష.ల ఓట్లు  వస్తాయి 

 కాపు, బలిజ,తెలగ  15% ఉన్నారు. అనగా 60 లక్షల ఓటర్లు. . వీరిలో 5% తెలుగుదేశానికి , 6% జనసేనకి , 4% జగంపార్టీకి దక్కే అవకాశం ఉంది.వీరిలో 70% పోల్ అవుతే , 42 లక్షల ఓట్లు పోల్ అవుతాయి  అంటే టి డి పి కి 14లక్షల ఓట్లు వస్తాయి.  జగన్ కి 10లక్షలు,జనసేనకి 18లక్షల ఓట్లు . 

వెనకబడిన వర్గాల ఓట్లు 35%ఉంటాయి. అనగా 1కోటి 20 లక్షల ఓట్లు. వీటిలో 65% పోల్ అవుతాయనుకొంటే, 80 లక్షల ఓట్లు పోల్ అవుతాయి. వీటి లో 50శాతం అనగా 40లక్షల ఓట్లు టి డి పి కి పడతాయి.  

ఉన్నతవర్గాల ఓట్లు 18% లో బ్రాహ్మణులూ 3%, కమ్మ 3%,రెడ్డి 5%, వెలమ 2%, వైశ్య 4%, క్షత్రియ 1%. అనగా 70 లక్షల ఓట్లు.  వీరి నుండి పోలింగ్ శతం తక్కువగా ఉంటుంది. కేవలం 50% మాత్రమే ఓటు హక్కు వినియోగించు కొంటారు. అనగా 35 లక్షల ఓట్లు మాత్రమే పోల్ అవుతాయి. వీటిలో 10 లక్షల ఓట్లు  టి డి పి కి దక్కుతాయి. 
అనగా మొత్తం పోల్ అయ్యే ఓట్లు = 280000 00. అనగా 70% పోల్ జరిగే అవకాశం ఉంది. 
వీటిలో 68+14+40+10 = 13200 000 ఓట్లు టి డి పి కి దక్కుతాయి. 47. 5 %ఓట్లు .  
జగన్ కి 47 +10 + 35+ 20 = 1కోటి 12లక్షల ఓట్లు. 40% ఓట్లు . 
జనసేన కూటమికి 4+ 18+ 5+ 5 = 32లక్షల ఓట్లు. 11. 5 % ఓట్లు . 


" సంపద పెంచు - సమానంగా పంచు" అనే నినాదం తో రాష్ట్రాన్ని పురోభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయకత్వం ఈ రాష్ట్రానికి చారిత్రిక అవసరం. ఏదో ఈ ఒక్క సారి ప్రతి పక్షానికి అవకాశం ఇచ్చి చూద్దాం"అనే ఆలోచన భయంకర పరిణామాలకు దారితీస్తుంది.  చంటిబిడ్డ లాంటి ఆంధ్ర రాష్ట్రం అనుభవ శూన్యులైన నాయకుల చేతిలో పెడితే  అభివృద్ధి ఆగిపోవడమే కాదు, తెలంగాణ ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతుంది. కేంద్రంలోని మోడీ గారి కాళ్లదగ్గర బానిసగా దిగజారిపోతుంది. దయచేసి ఒక్క సారి సీరియస్ గా ఆలోచించి ఓటేయండి. 
నాకు చంద్రబాబు, TDP పార్టీ ,జగన్ గారు, YSR పార్టీ, KCR&MODI గారు తదితర నాయకులపై ఎలాంటి అభిమానం గానీ, ద్వేషం గానీ లేదు. కేవలం ఆంద్ర రాష్ట్ర భవిష్యత్ నాకు ముఖ్యం. 5కోట్ల ఆంధ్రుల పురోభివృద్ధి నా ధ్యేయం. దీనికి అడ్డు వచ్చే ఏ నాయకుడినైనా, ఏ పార్టీనైనా ఎదుర్కొంటాను. తెలుగు తల్లికి దాస్యం చేసే నాయకుడిని ఎన్నుకొందాం. మోసం, హత్యలు,మాఫియా,హవాలా సంస్కృతికి దాస్యం చేసే నాయకుడిని తరిమికొడదాం. 

2019 లో గెలుపెవరిది ?
                             ఆంధ్రుడిదే గెలుపు! 

Comments