Skip to main content

మోడీ గెలిచాడా ? అనేది ప్రశ్న కాదు , భారత దేశం నిలిచిందా ? అనేది పాయింట్ !

పెద్దనోట్ల రద్దుతర్వాత ,కేవలం 50 రోజులలో ,  ఒక లక్ష  ఏబది వేల బాంక్ ఖాతాలలో సుమారుగా  4 లక్షల కోట్ల  విలువైన పాతనోట్లు జమ ' అయ్యాయి అంటే మనదేశంలో కనీసం 1. 5 లక్షల మంది దగ్గర  నల్ల డబ్బు గుట్టలు ఉన్నాయని అర్ధం అవుతుంది .
అంతే కాదు సుమారు 2లక్షల మంది   50000 కోట్ల  విలువైన పాతనోట్ల తో బాంక్  బకాయిలు తీర్చేశారు .
అలాగే పేదవారి జనధన ఖాతాలలో సుమారు 40000 కోట్ల విలువైన పాతనోట్లు జమ అయ్యాయి .
అంటే మనదేశంలో గారంటే గా 2లక్షల మంది నల్ల  బడాబాబులు ఉన్నారని అర్ధం అవుతుంది .
ఇవన్నీ పక్కనపెడితే ఆదాయ పన్ను దాడులద్వారా కేవలం 4000 కోట్లు మాత్రమే దొరికింది .
 14 లక్షలకోట్ల విలువైన పాతనోట్లు బాంక్ లకు తిరిగి వచ్చ్చేశాయి . అంటే , సుమారు 1. 4 లక్షల కోట్ల పాతనోట్లు జమ అవ్వలేదు .
ఏదిఏమైనా నోట్లరద్దు ద్వారా ప్రభుత్వానికి కనీసం 4లక్షలకోట్ల రాబడి వస్తుందని లెక్కవేయడం కరెక్టే అని అనిపిస్తుంది . అంతే కాదు, కుంగి కునారిల్లు తున్న బాంకింగ్ వ్యవస్థ లోకి అపరిమితమైన ధన ప్రవాహం రావడం తో వడ్డీలు తగ్గే అవకాశం ఉంది .  పురపాలక  శాఖ మొదలు కొని అన్ని ప్రభుత్వ శాఖల పన్ను బకాయిల  వసూళ్లు , బాంక్ ల మొండి బకాయిలు  కూడా వసూల్ కావడం  ఎంతో మంచి పరిణామం .
కొత్త నోట్ల ముద్రణకు 10వేలకోట్లు ఖర్చు , 50రోజులపాటు జనం వారిపనులు మానుకోవడం వలన ,చేతి లో కరెన్సీ లేకపోవడం వలన వారి కొనుగోలు శక్తి తగ్గిపోవడం ద్వారా  పరిశ్రమల  ఉత్ప త్తి ,  వ్యాపారస్తుల అమ్మకాలు తగ్గిపోవడం వలన దేశ ఉత్పత్తి విలువ (GDP) కనీసం 50000 కోట్లు తగ్గిందని అంచనా వేసినా, మొత్తం నష్టం 60 వేల కోట్లు దాటదు .
కానీ , ఈ రద్దు చర్య  వలన , ప్రజల ఆలోచనల్లో , లావా దేవీ లలో (digital transactions)  తెచ్చ్చిన మౌలికమైన మార్పు  కి వెల  కట్టలేం . ఎందుకంటే మళ్ళీ నల్లధనం పేరుకు పోకుండా కొంతవరకు అడ్డుకట్ట వేస్తుంది .
నల్లధనం పూర్తి కట్టడి అనేది అసాధ్యం . అలాగే పూర్తి డిజిటల్ లావాదేవీలు కూడా అసాధ్యం .
ఏదిఏమైనా చెదలు పట్టిన వ్యవస్థ లో మార్పు రావడం అనేది అత్యంత అవసరం . ఆ మార్పు కొంతమందికి బాధను కలిగించ వచ్చుఁ . కానీ మనకో సామెత ఉందిగదా ....  " No pains No gains". 
గమనిక : పైన చెప్పిన లెక్కలన్నీ ఆదాయ పన్ను శాఖ వారు తేటతెల్లం చేసినవే . 

Comments