Skip to main content

మమ్ము దేవత ల్లాగా చూడకండి . మనుషులుగా ఉండనీయండి .

మన దేశం లో అత్యంత క్లిష్ట మైన వ్రుత్తి ఏది ?
వైద్య వ్రుత్తి . Exasperated, doctors say, ‘don’t treat us like a God, just treat us like a human being’. The fact that the number of students taking the medical exam has declined recently bears testimony to this harsh reality.
why its difficult?
poor working conditions and 24*7*365 emergencies, the need for specialisation and competition to keep oneself updated, COPRA hanging like sword of Damocles; the occupational hazards of acquiring infection and the brunt of mob violence. what a horrendous plight?

is it that much difficult to become a doctor?
Yes. one shouldn't forget the hardship and turmoil faced  in becoming a doctor. One must not belittle the sacrifices of the young doctors and their parents.  hardships faced in the course of  becoming a doctor demands great struggle during prime years of one’s youth for not so commensurate rewards in the end. 

what is the objective of Indian Medical Council (Professional conduct, Etiquette and Ethics) Regulations, 2002?
                                   To safeguard the interest of patients.

what is the modality of this act?
  • enforcing  a social obligation on doctors. 
  • enforcing the doctors to live up to a set of values and standards voluntarily adopted by the fraternity.
మన దేశం లో ఇలాంటి "నైతిక విలువల రక్షణ చట్టం" మరే వృత్తికీ లేదు . అంటే మిగతా వృత్తులన్నీ
అంత పరిశు ద్దం గా ఉన్నాయా ?
కేవలం వైద్య సర్వీసులను మాత్రమే వినియోగ దారుల రక్షణ చట్టం పరిధి లోకి లా క్కొచ్చారు .
మరి మిగతా సర్వీసుల  నుండి ప్రజలకు రక్షణ అక్కర లేదా ?
టీచర్, ఇంజనీర్,ఆడిటర్ ,లాయర్ ,ఉద్యోగులు ,రాజకీయ ప్రజా నాయకులు -వీరెవరూ సర్వీస్ చేయడం లేదా ?
వీరి సర్వీసులను ప్రజలు వినియో గించు కోవడం లేదా ?
వైద్య సర్వీసు ఒక్కటే  వినియోగపర వస్తువా ?

ఎప్పుడైతే వైద్య సర్వీసులను ఓ వస్తువు గా పరిగ ణిం చడం చేశారో
ఆ "వస్తువు" ఓ వ్యాపార వస్తువు మాదిరిగా  ధర అమాంతం పెరిగి పోయి సామాన్యుడికి
అంద  కుండా పోయింది .అప్పటి నుండే రోగులు కూడా డాక్టర్స్ ని ఓ ట్రే డ ర్ ,నల్లబజారు డాన్
 లెక్కన చూస్తు న్నారు .

పాత కాలం లో ఉన్న" రోగుల -వైద్యుల సంబంధాలను" ఆధారం చేసుకొని , ఆ కాలంలో డాక్టర్ అంటే దేవుడి తో సమానం ,ఈ కాలంలో వైద్యులు దయ్యాలు ,జలగల లెక్కన రక్తాన్ని పీల్చేస్తు న్నారని ఊదర గొట్టేస్త న్నారు . 
వైద్యు డంటే  దేవుడి లెక్క లో త్యాగాలు చేస్తూ సమాజానికి సేవ చేయాలని ,మిగతా వర్గాల వారు ఆ సేవలను ఎంజాయ్ చేస్తూ ఉండాలని , ఆ ఎంజాయ్ మెంట్ లో ఏ కొద్ది  తేడా వచ్చినా వైద్యుల చెమడాలు  తీయడానికి అందరూ మూకుమ్మడిగా పడిపోవాలని మీడియా కోడై కూస్తుంది . 

అన్ని వర్గాల వారు కేవలం 8గంటలు పని చేస్తారు . అదే డాక్టర్స్ మాత్రం 24 గంటలూ ఓ యంత్రం లెక్క
 పనిచేయాలి . ఇచ్చే జీతం చూస్తే  , బొడ్డు ఊ డని  సాఫ్ట్వేర్ కుర్రాడు సంపాదించే రొ క్క మంత ఉండదు .  

సంఘం లో అన్ని  వర్గాలు  అవినీతిలో మురిగిపోయినా ఎలాంటి స్పందన లేని స్థితిలో ఉన్న సమాజం ,
ప్రతి చావుకి , బలహీనం గా ఉన్న  ఒకే ఒక వర్గాన్ని -వైద్యుల నే   టార్గెట్ చేస్తూ,సృష్టిస్తున్న 
 అరాచకం భరించే ఓర్పు , సహనం వైద్యులకు ఇక లేదు . 

ప్రభుత్వం తను చేయ వలసింది వదిలేసి ,డాక్టర్స్ పల్లెలకు పోక పోవుట వలనే 
దేశ ఆరోగ్య స్థితి దిగజారి పోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు . 
సరైన ప్లానింగ్ ,మానిటరింగ్ లేకుండా ప్రభుత్వం ఎన్నో కోట్ల ధనాన్ని వృధా చేస్తుంది .  

ప్రభుత్వం తలచు కొంటే ఆరోగ్య కేంద్రాలకు,స్టాఫ్ కి భవనాలు ,నిరంతర మందుల సరఫరా ,
అన్నిరకాల ఖాళీ  పోస్ట్ ల భర్తీ -ఇవన్నీ చేయ గలదు . 

ప్రైవేట్ సెక్టార్ లో మెడికల్ విద్య ని అమ్ముకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినంత కాలం , 
మెడికల్ సర్వీస్ ల లో వ్యాపార దృక్పదాన్ని ప్రభుత్వం అరికట్ట లేదు . 
మెడికల్ విద్య మాఫీయా  లో ముఖ్య పాత్రధారులు సూత్రధారులు రాజకీయ నాయకులే . 
వారి కొమ్ము కాచేది ప్రభుత్వం . 

ఇంత  మంది జనాలకు ఇంతమంది డాక్టర్స్ ఉండాలి ,ఇన్ని మంచాలుండాలి , అనే  తప్పుడు లెక్కలు ,అంచనాలు చూపెట్టి , లెక్కకు మించి మెడికల్ కాలేజీలను 
దక్షిణ భారదేశం లో పుట్ట గొడుగు ల్లాగా పెంచు కొంటూ పోతూ ,వైద్య విద్యని ,వైద్య వృత్తిని నిర్వీర్యం చేస్తున్నారు . 
ఇప్పటికే ఇంజనీరింగ్ విద్య ని ఎంతగా భ్రష్ట్టు పట్టిమ్చారో మనం చూస్తున్నాము . 
వైద్యుల ,మెడికల్ కాలేజీల కొరత ఉన్న  తూర్పు ఈశాన్య రాష్ట్రాలు ,ఉత్తర భారతం లో మెడికల్ కాలేజీలు పెట్టరు . 
ఎందు కంటే అక్కడ సీట్లు  కొనే వాళ్ళు లేరు . 
నేడు దక్షిణ భారత దేశం లో MBBS డాక్టర్స్ , సరైన   ఉద్యోగాలు లేక రోడ్డున పడుతున్నారు . 
100 ఖాళీ పోస్టు లుంటే 1000 మంది పోటీ పడుతున్నారు . 
నేడు ప్రజలు కూడా, చిన్న చిన్న జబ్బులకి డైరెక్ట్ గా  స్పెషలిస్ట్ డాక్టర్ నే కోరు కొంటున్నారు . 
దీనివలన  MBBS డాక్టర్స్ అటు  PG చేయ లేక ,ఇటు సరైన ఉద్యోగం లేక నిరాశలో కూరుకు పోతున్నారు . 
మొదట ఫామిలీ వైద్యుడు  పరీక్షించి , రిఫర్ చేయాలి అనే పరిస్థితి నేడు లేదు . 

కొత్తగా వైద్య విద్య చదవడానికి ఎందరో ప్రతిభా వంతులు వెనుకంజ వేస్తున్నారు . 
కేవలం వైద్య వ్యాపారులు ,కార్పోరేట్ హాస్పిటల్ వారసులు ,వైద్యాన్ని వ్యాపారం గా చూసే వారు మాత్రమే 
వైద్య విద్య లో ప్రవేశిస్తు న్నారు . ఇలాంటి స్థితిలో వైద్యం వ్యాపారం గా మారకుండా ఆపే శక్తి ఎవరి కుంది ? 

అత్యవసర వైద్య చికిత్స కు కావలసిన సౌకర్యాలు లేకుండా , టీకాలు స్టోర్ చేయడానికి కరెంటు ,ఫ్రిజ్ లేని కప్పు రాలిపోతున్న భవనాలు , కనీస రక్త పరీక్షలు చేయ లేని లాబ్ లు ,కుక్కలు పందులు యదేచ్చగా చిందు లేసె  గోడలు లేని కాంపౌండ్ లు -ఇంత  దరిద్ర మున్న చోట వైద్యుడు పనిచేయాలని హుకుం జారీ చేసి అధికారులు ,మీడియా  వారు చోద్యం చూస్తున్నారు . 

క్వాలిటీ మందులు తయారు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ,నకిలీ మందుల పరిశ్రమల ఏరివేత , 
మందుల నాణ్యత పై నిరంతర నిఘా -ఇవేమీ చేయ లేని ప్రభుత్వం మెడికల్ సర్వీస్ ల్లో నాణ్యతను ఎలా 
రాబట్ట గలదు ? 

పల్లెల్లో ,మెట్రో ల్లో నకిలీ వైద్యులను ఏరి వేయ లేని ప్రభుత్వం నిఖార్సైన వైద్యులకు అమలుచేయ లేని
(impractical) విధివిధానాల పేరుతో, సుమారు 200 రకాల చట్టాలు ,25 రకాల టాక్సుల తో, శీలలు దిగ్గొ ట్టి 
అధునాతన వైద్యం  సామాన్యుడికి అందని ద్రాక్ష ని చేసింది . 

అటు సన్నకారు రైతులూ ,ఇటు  చిన్న చిన్న హాస్పిటల్స్ మన దేశం లో 
కను మరు గయ్యే పరిస్థితి దాపు రిం చింది .
ఎప్పుడో తాతల కాలం నాటి రూల్స్ తో కనీసం 50 బెడ్స్ ఉంటేనే ఇన్సురెన్స్ ఎం పానెల్ మెంట్ ఇస్తూ , కేవలం కార్పోరేట్ హాస్పిటల్ వారికే అవకాశం, తద్వారా లబ్ది పొందే టట్లు చేస్తున్నారు . 
టెక్నాలజీ పెరిగి డే కేర్ కి ప్రాధాన్యం పెరుగుతున్న ఈ మారుతున్న కాలంలో , ప్రైవేట్ వైద్యం లో 80శాతం చిన్న హాస్పిటల్స్ ద్వారా నే అందుతున్న నేటి కాలం లో ,ఇంకా హాస్పిటల్ బెడ్స్ నే ఆధారం చేసుకొని ఎం పానెల్ మెంట్ 
ఇవ్వడ మనేది దారుణం . 
ఇది ఒక విధం గా వైద్యాన్ని కార్పో రేటీక రించి ,చిన్న హాస్పిటల్స్ ని తుడిచి పెట్టేయ డమే. 

మెడికల్ రీసెర్చ్ కి , చౌకైన మందుల తయారీ కి , క్లినికల్ పరిశోధనలకు పెద్దపీట వేయలేని ప్రభుత్వం 
ప్రైవేట్ డాక్టర్స్ నుండి ,కార్పోరేట్ వైద్య సంస్థల నుండి   చౌకైన నాణ్య మైన సేవలు ఎలా ఆసించ గలదు ? 

ప్రభుత్వం సొంతం గా రిఫైనరీస్ ,స్టీల్,సిమెంట్,విద్యుత్  ఫాక్టరీలు నడుపుతుంది . 
మరెందుకు మందుల తయారీని భారీ స్థాయిలో చేపట్టదు ?
చక్కగా సొంతంగా జనరిక్ మందుల చైన్ ని -తయారీ ,నాణ్యతా పరీక్ష , సరఫరా -ఇవన్నీ ప్రభుత్వమే 
 చేప డితే , వైద్య కేంద్రాలకు ,సామాన్యులకు అందుబాటులో  మందులు ఉంటాయి గదా ?
పౌర సరఫరా శాఖ ద్వారా నిత్యావసర వస్తువులు సామాన్యుడికి ప్రభుత్వ మే అందిస్తుంది గదా ? మరెందుకు 
ప్రాణ రక్షణకు కీలక మైన మందులను సరఫరా చేయదు ? 

ప్రాధమిక వైద్యం , రోగ నిరోధ వైద్యం , ప్రజలలో "ఆరోగ్యం -దేశ ఆర్ధిక స్థితి"  పట్ల సంపూర్ణ అవగాహన ,
 ఆరోగ్య కరమైన ఆహార, విహార ,వ్యవహారాలలో ప్రజల కు అవగాహన పెంచడం  - ఇవన్నీ 
సామాజిక వర్గాల తోడ్పాటు తో ప్రభుత్వం చేస్తూ ఉంటే నే ఆరోగ్య సూచికలు మెరుగవుతాయి . 

ఎన్నో సమస్యలతో కుంగి కునారిల్లుతున్న "ఆరోగ్య విద్య -వైద్య రంగాలకు" కారణం డాక్టర్స్ కొరత,హాస్పిటల్స్ మంచాల కొరత , కానే కాదు . 
ఎప్పుడో కలరా ,మసూచి లాంటి అంటు వ్యాధులు ప్రబలిన కాలం లో  WHO వేసుకొన్న అంచనాల నే ఇప్పటికీ 
ఉదహ  రిస్తున్నారు . నేడు వైద్యం   సాంకేతికం గా  కొత్త పుంతలు తొక్కుతుంది . హాస్పిటల్ లో ఎక్కువ రోజులు ఉండవలసిన అవసరం నేడు లేదు . డాక్టర్స్ లేని మారుమూల ప్రాంతాలకు టె లి మెడిసిన్ ,మొబైల్ మెడిసిన్ ,
 చేతిలో ఇమిడి పోయే లాబ్ , ఇంకా ఎన్నో కొత్త కొత్త గాద్గేట్స్ వైద్యాన్ని ప్రజల ముంగిటికి చేరుస్తున్నాయి . 
రోగులను తమ ఇంటి నుండే మానిటర్ చేస్తున్నారు . 
పారామెడిక్  ల నైపుణ్య త , కొత్త సాంకేతిక విప్లవం  వైద్య విధానాలను సమూలం గా మార్చి వేస్తున్నాయి . 
నేటి కాలానికి ప్రతి 3000 మంది జనానికి 1 డాక్టర్ ,3నర్సులు ,ఒక హాస్పిటల్ మంచం ,
3 మెడికల్ టెక్నీ షియన్  లు ఉంటే సరి పోతుంది . 
దేశ వ్యాప్తం గా 400 మెడికల్ కాలేజీలు , 50000  MBBS సీట్లు , 25000 PG సీట్లు ఉన్నాయి . ఇవి చాలు . 
ఇప్పటికే దేశం లో సుమారు 7 లక్షల డాక్టర్స్ ఉన్నారు . వారిలో స్పెషలిస్ట్ లు కేవలం 2 లక్షల మంది . 

నేడు మనకు కావలసింది - 
1. ప్రతి PHC    కి 3 MBBS డాక్టర్స్ ఉండాలి . 
2. ప్రతి CHC   లో 4 స్పెషలిస్ట్ లుండాలి . 
3. ప్రతి  UHC  లో ఒక MBBS డాక్టర్ ,  ఒక స్త్ర్రీ వైద్య నిపుణు లుండాలి . 
4. పల్లెల్లో ని PHC   లలో కనీస సౌకర్యాలు , పనిచేసే వైద్య సిబ్బందికి రక్షణ ,వారి పిల్లల చదువుకి భద్రత కల్పించాలి . 
5. దక్షిణ భారత దేశం లో కొత్త గా మెడికల్ కాలేజీలకు అనుమతి నివ్వ కూడదు . ఉన్న కాలేజీలను పరిశోధనలకు అనుగుణం గా తీర్చి దిద్ది ,స్పెషలిస్ట్ డాక్టర్స్ సీట్లు పెంచాలి . 
6. ప్రతి 50 Km లకు ట్రామా కేర్ సెంటర్ లు , రక్త నిధి కేంద్రాలు ,ఫీవర్ క్లినిక్ లు ఉండాలి . 
7. ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఏదైనా మానవ వనరులు , పరికరాల కొరత ఉన్నప్పుడు - ప్రైవేట్ డాక్టర్స్ ,ప్రైవేట్ సంస్థల సేవలు తీసుకోవాలి . 
8. మెడికల్ ఎడ్యుకేషన్ సిలబస్ లో నేటి  కాలానికి తగినట్టుగా - సిమ్యు లేషన్ లెర్నింగ్ ,ఎలక్ట్రానిక్ జర్నల్స్ ,మెడికో లీగల్ విజ్ఞానం ,కమ్మ్యూ నికేషన్ స్కిల్స్ ,ఎమర్జెన్సి వైద్యం  అంశాలు కూడా చేర్చాలి . 
9. mHealth,eHealth,అలాగే సంచార వైద్య శాలలు విరివిగా వాడుకోవాలి . 
10. రోగులకి డాక్టర్ ని ,హాస్పిటల్ ని ఎన్నుకొనే స్వేచ్చ ఉండాలి . ఆ విధం గా భీమా కంపెనీ వారు 
ఎంపానెల్ మెంట్  రూల్స్ మార్చు కోవాలి . 
11. డాక్టర్స్ మెడ మీద కత్తి లా వేలాడు తూ ఉన్న CPA Act  నుండి వైద్యులను తప్పించి,వైద్య పరమైన నిర్లక్ష్యం కేసుల విచారణకు  వేరే ఏదైనా మెడికల్ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయాలి . 
12. ఫైర్ సేఫ్టీ  చట్టం , బయో కాలుష్య నియంత్రణా చట్టం , CE Act లను పూర్తిగా సవ రింఛి ,చిన్న చిన్న హాస్పిటల్స్ ను వీటి నుండి తప్పించాలి . (small hospital means below 10 beds).
13. ప్రతి హాస్పిటల్ స్థాపన నుండి ఏ ఏ టాక్సులు ,అనుమతులు , గుర్తింపులు కావాలో , అవన్నీ జిల్లా స్థాయిలో ఏక గవాక్ష విధానం లో ,వీలుంటే అంతర్జాలం లో ఆన్ లైన్ ద్వారా పొందే వెసులు బాటు ప్రభుత్వం కల్పించాలి . వైద్యుల విలువైన కాలాన్ని కాపాడాలి ,అలాగే లంచగొండి తనాన్ని తగ్గించే ఏర్పాటు చేయాలి . 
14. డాక్టర్స్ కి కావలసిన విదేశీ పరికరాల పై ఎలాంటి కస్టమ్స్ సుంకం లేకుండా చేయాలి . 
15. చిన్న హాస్పిటల్స్ పై  వ్యాపారాత్మక పన్నులు ,చార్జీల ను రద్దు చేయాలి . ఇంటి పన్ను ,ఆస్తి పన్ను ,కరెంటు చార్జీలు మొదలైనవి ప్రస్తుతం కమర్షియల్ రేటు వసూల్ చేస్తున్నారు . 
16.  70 ఏళ్ల వరకు రిటైర్మెంట్ కి అవకాశ మిచ్చినా ఇంకా మెడికల్  టీచర్ ల కొరత ఉంది . PG diploma  వారిని మెడికల్ కాలేజీలలో బోధనా సిబ్బంది గా తీసు కొంటే ఆ కొరతను అది గ మించ వచ్చు . 
17. డాక్టర్స్ ,దేశం లో  ఏ రాష్ట్రం లో మెడికల్ రిజిష్టర్ లో నమోదు  చేసినా మరల వేరే రాష్ట్రం కి బదిలీ అయి నప్పుడు ,మరల  రిజిష్టర్ చేసు కోవలసిన అవసరం లేకుండా , కేవలం (పనిచేసే రాష్ట్రానికి) ఆ రిజిష్ట్రేషన్ ను  ట్రాన్స్ఫర్ చేసు కొనే విధమైన ఏర్పాటు చేయాలి . 
18. డాక్టర్స్ వారి వారి రోగులకు మందులు పంపిణీ చేయ డానికి ఎలాంటి ముందస్తు అనుమతులు అవసరం లేకుండా ప్రభుత్వం ఓ చట్టం తేవాలి . 
19.  దేశ వ్యాప్తం గా అమలయ్యే విధం గా  ఫెడరల్ మెడికల్ రక్షణ చట్టాన్ని తేవాలి . అలాగే ఈ చట్టం ని  IPC లో ని సెక్షన్స్ కి సమన్వయం చేయాలి . 
20. సరైన రుజువు ఉంటే నే -అనగా మెడికల్ కమిటీ రిపోర్ట్ లో వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలి నప్పుడే డాక్టర్స్ పై కేసు నమోదు చేయాలి . అప్పటి వరకు వైద్యులపై ఎలాంటి కేసు నమోదు చేయ కూడదు . ఈ విధం గా ప్రభుత్వం చట్టం చేయాలి . 

100% టీకాలు ,పోషకాహారం పై స్త్రీలకూ ,పిల్లలకు అవగాహన కలిగించి ఆ ఆహారాన్ని వారికి అందించిన ప్పుడు ,
నర్సింగ్ ఉద్యోగాల కు పోస్ట్ లను పెంచి భర్తీ చేసి నప్పుడు ---  దేశ ఆరోగ్యం లో ఎంతో మార్పు వస్తుంది . 

సవాలక్ష కారణాలతో  ఆరోగ్య సూచీలు ప్రమాద ఘంటికలు మోగిస్తూ ఉంటే ,వీటన్నింటి కీ కారణం 
వైద్యుల ధన దాహం ,నిర్లక్ష్యం ,పల్లెలకు పోవడానికి వైముఖ్యత -అనే కుంటి సాకులు చెబుతూ ప్రభుత్వమూ ,మీడియా  వైద్యులను అడుగడుగునా  బలి పశువులను చేస్తున్నాయి .  
ఈ దుర్మార్గం ఇక నైనా ఆపాలి . డాక్టర్స్ ని,దేవుడు లెక్క కాదు  కనీసం మనిషి లాగా నైనా చూడండి . 

Comments

Post a Comment