Skip to main content

ప్రజలకు ఖరీదు కట్టే షరాబులున్న నేటి కాలం లో ప్రజాస్వామ్యం ఓ వికృత ఖరీదు క్రీడ ...

సీమాంధ్రలో  ఉన్న 3.70 కోట్ల మంది ఓటర్ల లో 70 లక్షల మంది ఓటు కి డుమ్మా కొట్టారు .
100 కోట్ల నల్ల ధనం పట్టుబడింది .
ఏకం గా లిక్కర్ పరిశ్రమ నే పెట్టుకొని యదేచ్చగా ప్రజలకు మందేక్కిం చారు .
ప్రజలను మత్తులో ముంచి ఇంకా ఏదైనా స్పృహ ఉంటే డబ్బుతో కొట్టి ,పోలింగ్ బూత్  లో ఏ  మీట నొక్కాడో
తెలియని అయోమయం లో ఓటే యించి 80 శాతం ఓటింగ్ నమోదు ఐయిందని చంకలు కొట్టుకొంటున్న మనకు అవసరమా ప్రజా స్వామ్యం ?

పేద ధనిక వర్గాల మధ్య పెరుగుతున్న అంతరాల అఖాతం ,
గిట్టుబాటు కాని వ్యవసాయంతో ఉడిగి పోతున్న రైతన్న
జనాలను సోమరులుగా ఏమారుస్తున్న ప్రభుత్వాలు
మందు విందు లతో మసక బారి పోతున్న యువత  -ఇదీ నేటి భారతం .

 లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల జాతర జరిపించే స్థోమత మన దేశాని కుందా ?
ఈ ఎలక్షన్ ల వలన ,మంత్రుల  చిరునామాలు  తప్ప వ్యవస్థ మారుతుందా ?  మన అవ స్తలేమైనా తప్పుతాయా ?


Comments